కరివేములలో చోరీ

ABN , First Publish Date - 2021-04-17T04:50:04+05:30 IST

మండలంలోని కరివేముల గ్రామంలో శుక్రవారం ఆ గ్రామానికి చెందిన బోయ రాముడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీ జరిగింది.

కరివేములలో చోరీ

  1. రూ.4.11 లక్షల అపహరణ 


దేవనకొండ, ఏప్రిల్‌ 16: మండలంలోని కరివేముల గ్రామంలో శుక్రవారం ఆ గ్రామానికి చెందిన బోయ రాముడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీ జరిగింది. ఇంట్లో ఉన్న రూ.4.11లక్షలను ఎత్తుకెళ్లారు. కుటుంబ సభ్యులు ఉదయం ఉపాధిహామీ పనులకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన తరువాత ఇంటికి వేసిన గడియలు తెరిచి ఉండడంతో అనుమా నం వచ్చి ఇంట్లో ఉన్న డబ్బులు, వస్తువులను పరిశీలించారు. రూ.4.11 లక్షలు చోరీ జరిగినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డాగ్‌స్క్వాడ్‌, ఫింగర్‌ప్రింట్స్‌ టీం వచ్చి దొంగతనం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. పత్తికొండ పట్టణ సీఐ నారాయణరెడ్డి, స్థానిక ఎస్‌ఐ కిరణ్‌ బాబు ఘటనా స్థలానికి వెళ్లి బాధితులను వివరాలు అడిగి తెలుసు కున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 

Updated Date - 2021-04-17T04:50:04+05:30 IST