ఐసొలేషన్ వార్డు నుంచి నలుగురు డిశ్చార్చి
ABN , First Publish Date - 2020-03-27T10:45:11+05:30 IST
కరోనా అనుమానితులుగా ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న నలుగురికి ఎలాంటి వైరస్ సోక లేదని
ఏలూరు క్రైం, మార్చి 26 : కరోనా అనుమానితులుగా ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న నలుగురికి ఎలాంటి వైరస్ సోక లేదని నిర్ధారణ కావడంతో గురువారం డిశ్చార్జి చేశారు. వార్డులో ఉన్న ఐదుగురిలో నలుగురిని డిశ్చార్జి చేయగా కొయ్యలగూడెం మండలానికి చెందిన వ్యక్తి పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ తాను క్వారంటైన్ టైమ్ పూర్తయ్యే వరకు ఆసుపత్రిలోనే ఉంటానని చెప్పడంతో అతన్ని మాత్రం ఉంచారు. అతనికి ఏ విధమైన వ్యాధులు లేదని వైద్య పరీక్షలో స్పష్టమైంది. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆసుపత్రిలో 200 పడకలను సిద్ధం చేయడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు.