రైతుల త్యాగాలు విస్మరించి.. బేడీలతో శిక్షా!

ABN , First Publish Date - 2020-10-31T06:26:47+05:30 IST

రాజధాని రైతులపై అక్రమంగా కేసులు పెట్టి అవమానపర్చడం దారుణమని టీడీపీ మండల నాయ కులు పేర్కొన్నారు.

రైతుల త్యాగాలు విస్మరించి.. బేడీలతో శిక్షా!
ముమ్మిడివరంలో అంబేడ్కర్‌కు వినతిపత్రం ఇస్తున్న నాయకులు

ముమ్మిడివరం, అక్టోబరు 30: రాజధాని రైతులపై అక్రమంగా కేసులు పెట్టి అవమానపర్చడం దారుణమని టీడీపీ మండల నాయ కులు పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం అర్దాని శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడారు. రైతులను భయపెట్టి ఉద్యమాన్ని నీరుగార్చేందుకే ప్రభుత్వం ఈవిధంగా వ్యవహరిస్తుందన్నారు. అనంతరం పార్టీ జెండాలను చేతబట్టి కాశివానితూముసెంటర్‌ వరకు ర్యాలీగా తరలివెళ్లారు. అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో గొలకోటి దొరబాబు, చెల్లి అశోక్‌, తాడి నరసింహారావు, పొద్దోకు నారాయణరావు, పొత్తూరి విజయభాస్కరవర్మ, నడిమింటి సూర్యప్రభాకరం, దాట్ల బాబు, గొల్లపల్లి గోపి, దొమ్మేటి రమణకుమార్‌, యాళ్ల ఉదయ్‌, బొక్కా రుక్మిణి, చిక్కాల అంజిబాబు, కురసాల శివ, మట్ట సత్తిబాబు, మెండి కమల, మిమ్మితి చిరంజీవి, భీమవరపు సూర్యారావు, సత్తి నూకరాజు, కాశి సత్యనారాయణమూర్తి, పెదపూడి రుక్మిణి  పాల్గొన్నారు.

Updated Date - 2020-10-31T06:26:47+05:30 IST