ఏపీలో అధ్వాన్నంగా జగన్ రెడ్డి పాలన: Chinta mohan

ABN , First Publish Date - 2022-01-04T19:33:04+05:30 IST

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన అధ్వానంగా తయారయిందని తిరుపతి మాజీ ఎంపీ చింత మోహన్ అన్నారు.

ఏపీలో అధ్వాన్నంగా జగన్ రెడ్డి పాలన: Chinta mohan

చిత్తూరు:  రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన అధ్వానంగా తయారయిందని తిరుపతి మాజీ ఎంపీ చింత మోహన్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీకి పొయి పీఎం కాళ్ళు పట్టుకొన్నవా , గడ్డం పట్టుకొన్నవా తెలీదు గాని ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి తేలేదని వ్యాఖ్యానించారు. జగనన్న విద్య దీవెన, జగనన్న గోరుముద్ద ఇవన్నీ నువ్వు కొత్తగా ఏమైనా పెట్టావా ఇంతకు ముందున్న పథకాలె మార్చి నీ పేరు పెట్టుకుంటావా అని మండిపడ్డారు. రాష్ట్రంలో దళితులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా ఉందని తెలిపారు. పీర్సీ ఊసేలేదని... అది చేస్తాం... ఇది చేస్తాం అని ఎన్నికల ముందు హామీ ఏమైందని చింతామోహన్ ప్రశ్నించారు. 


Updated Date - 2022-01-04T19:33:04+05:30 IST