డీసీసీబీ మాజీ చైర్మన్‌ ప్రభాకర చౌదరి మృతి

ABN , First Publish Date - 2021-09-17T07:27:11+05:30 IST

చంద్రగిరి మండలం దిగువ కాశిపెంట్లకు చెందిన డీసీసీబీ మాజీ చైర్మన్‌, టీడీపీ సీనియర్‌ నాయకుడు కొండేపాటి ప్రభాకర చౌదరి అనారోగ్యంతో గురువారం రాత్రి మృతి చెందారు.

డీసీసీబీ మాజీ చైర్మన్‌ ప్రభాకర చౌదరి మృతి
ప్రభాకరచౌదరి (ఫైల్‌ ఫొటో)

చంద్రగిరి, సెప్టెంబరు 16: చంద్రగిరి మండలం దిగువ కాశిపెంట్లకు చెందిన డీసీసీబీ మాజీ చైర్మన్‌, టీడీపీ సీనియర్‌ నాయకుడు కొండేపాటి ప్రభాకర చౌదరి అనారోగ్యంతో గురువారం రాత్రి మృతి చెందారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితంగా మెలుగుతూ, ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. కాశిపెంట్ల సర్పంచ్‌గా, ముంగిలిపట్టు సింగిల్‌విండో చైర్మన్‌గా, ఆప్కో డైరెక్టర్‌గా సేవలందించారు.1987-90సంవత్సరాల మధ్య డీసీసీబీ చైర్మన్‌గా పని చేశారు.ఈయన మృతి టీడీపీకి తీరనిలోటని పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈయన అంత్యక్రియలు దిగువ కాశిపెంట్ల గ్రామంలో శుక్రవారం నిర్వహించనున్నారు. 

Updated Date - 2021-09-17T07:27:11+05:30 IST