టీడీపీ అనకాపల్లి జిల్లా మహిళా కమిటీ ఏర్పాటు

ABN , First Publish Date - 2022-07-04T06:26:26+05:30 IST

తెలుగుదేశం పార్టీ అనకాపల్లి జిల్లా మహిళా అధ్యక్షురాలిగా మునగపాక మండలానికి చెందిన ఆడారి మంజు నియామకమయ్యారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు మహిళా కమిటీ వివరాలను ఆదివారం ప్రకటించారు.

టీడీపీ అనకాపల్లి జిల్లా మహిళా కమిటీ ఏర్పాటు
జిల్లా మహిళా కమిటీని ప్రకటిస్తున్న జగదీశ్‌

అనకాపల్లి అర్బన్‌, జులై 3 : తెలుగుదేశం పార్టీ అనకాపల్లి జిల్లా మహిళా అధ్యక్షురాలిగా మునగపాక మండలానికి చెందిన ఆడారి మంజు నియామకమయ్యారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు మహిళా కమిటీ వివరాలను ఆదివారం ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా రొంగలి శ్రీరాములమ్మ (సబ్బవరం), కుచ్చు కళావతి (చీడికాడ), కాయల ప్రసన్న (అనకాపల్లి), కె.హైమావతి (కోటవురట్ల)లను నియమించారు.  ప్రధాన కార్యదర్శిగా సుకల రమణమ్మ (నర్సీపట్నం), స్పోక్స్‌పర్సన్‌లుగా కలిగట్ల సరస్వతి (కశింకోట), పి.సత్యవతి (చీడికాడ), ఆర్గనైజింగ్‌ కార్యదర్శులుగా కాండ్రేగుల ధనలక్ష్మి (పాయకరావుపేట), ఎ.తులసీ (రాంబిల్లి), ఎం.భవాని (బుచ్చెయ్యపేట), కాళ్ళ వరలక్ష్మి (పెందుర్తి), కె.రామలక్ష్మి(గొలుగొండ), వి.దేవి (రోలుగుంట), ప్రభావతి (అనకాపల్లి), కార్యదర్శులుగా కరణం లక్ష్మి (సబ్బవరం), సాలాపు అమ్మాజీ (సబ్బవరం), ముత్యాల జ్ఞానేశ్వరి (పాయకరావుపేట), రేబాక మాలతి (మునగపాక), చిన్నమ్మలు (కె.కోటపాడు), కె.రత్నమాల (చీడికాడ), అప్పలనర్సమ్మ (రావికమతం), కె.ఈశ్వరమ్మ (కశింకోట) నియామకమయ్యారు. అలాగే, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులుగా బూడి పుష్పలత (ఎలమంచిలి), మరపురెడ్డి రమాకుమారి (పాయకరావుపేట), రేగట మంగ (నర్సీపట్నం), మడక పార్వతి (పెందుర్తి), కోట నీలవేణి (చోడవరం), కొల్లి వెంకటలక్ష్మి (మాడుగుల), పి.గంగాభవాని (అనకాపల్లి) నియామకమయ్యారు. 

----------------------------

Updated Date - 2022-07-04T06:26:26+05:30 IST