బీహార్ ఓటర్లకు ప్రధాని మోదీ తాజా సూచన

ABN , First Publish Date - 2020-10-28T14:47:10+05:30 IST

బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మొదటివిడత పోలింగ్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓటర్లకు తాజాగా సలహా ఇచ్చారు.

బీహార్ ఓటర్లకు ప్రధాని మోదీ తాజా సూచన

పోలింగులో కొవిడ్-19 మార్గదర్శకాలు పాటించండి...

పట్నా (బీహార్): బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మొదటివిడత పోలింగ్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓటర్లకు తాజాగా సలహా ఇచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ఓటర్లు ఓటు వేసేటపుడు కొవిడ్-19 మార్గదర్శకాలను పాటించాలని ప్రధానమంత్రి మోదీ కోరారు. ‘‘కొవిడ్-19కు వ్యతిరేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ప్రజాస్వామ్య ఉత్సవంలో పాల్గొనాలని ఓటర్లందరినీ నేను కోరుతున్నాను’’ అని ప్రధాని మోదీ బుధవారం ట్వీట్ చేశారు.బీహార్‌లోని 71 నియోజకవర్గాల్లో బుధవారం పోలింగ్ జరుగుతోంది. రెండవ, మూడవ దశ ఎన్నికలు వరుసగా నవంబర్ 3, నవంబర్ 8 న జరగనున్నాయి.బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను నవంబర్ 10 న ప్రకటించనున్నారు. కరోనా జాగ్రత్తలు తీసుకొని బీజేపీకి ఓట్లు వేయాలని బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓటర్లను అభ్యర్థించారు.

Updated Date - 2020-10-28T14:47:10+05:30 IST