అభివృద్ధి పనులపై దృష్టిసారించాలి
ABN , First Publish Date - 2020-05-27T10:32:54+05:30 IST
అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని ఎంపీడీవో రజనికాంత్ తెలిపారు. ఆయన స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ..
ఏఎస్పేట, మే 26: అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని ఎంపీడీవో రజనికాంత్ తెలిపారు. ఆయన స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ సహాయకులతో సమావేశం నిర్వహించారు. లాక్డౌన్తో గ్రామాల్లో అభివృద్ధి పనులు అకస్మాత్తుగా నిలిచిపోయాయని, ప్రస్తుతం పనులను వేగవంతం చేయాలన్నారు. అంతేకాకుండా పారిశుధ్యంపై దృష్టిసారించాలన్నారు. కార్యక్రమంలో ఈవోపీఆర్డీ ప్రసాద్ పాల్గొన్నారు.