రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

ABN , First Publish Date - 2021-01-27T05:33:54+05:30 IST

గణతంత్ర దినోత్సవం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగింది.

రెపరెపలాడిన మువ్వన్నెల జెండా
కరీంనగర్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్న కలెక్టర్‌ శశాంక

 ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా గణతంత్ర దినోత్సవం

కరీంనగర్‌, జనవరి 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): గణతంత్ర దినోత్సవం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగింది. కరీంనగర్‌ పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ కె శశాంక జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈసారి వేడుకలపై కరోనా ఎఫెక్ట్‌ పడింది. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, జిల్లా అభివృద్ధిని, ప్రగతిని తెలిపే శకటాల ప్రదర్శనను రద్దు చేశారు. ఐదుగురు స్వాతంత్య్ర సమరయోధులను మాత్రమే సన్మానించారు. పరేడ్‌ గ్రౌండ్‌లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళల సంచార బయోటాయిలెట్‌ వాహనం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వేడుకలకు హాజరైనవారికి మిషన్‌ భగీరథ వాటర్‌ బాటిల్స్‌ అందజేయగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ వాటర్‌ తాగుతూ అందరి దృష్టిని ఆకర్షించారు. 

  

Updated Date - 2021-01-27T05:33:54+05:30 IST