మద్యం మత్తులో ఉన్న భర్తకు భోజనం తెచ్చేందుకు బయటికి వెళ్లిన భార్య.. మరుక్షణం అర్ధ నగ్నంగా ప్రత్యక్షం.. ఇంతకీ ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-08-26T01:08:53+05:30 IST

ఫుల్‌గా మందు కొట్టి ఇంటికొచ్చిన భర్తకు ఆమె ఏమాత్రం విసుక్కోకుండా సపర్యలు చేసింది. ఆకలి అనడంతో భోజనం తీసుకొద్దామని హోటల్ వద్దకు బయలుదేరింది. అయితే మధ్యలో ఆమెను..

మద్యం మత్తులో ఉన్న భర్తకు భోజనం తెచ్చేందుకు బయటికి వెళ్లిన భార్య.. మరుక్షణం అర్ధ నగ్నంగా ప్రత్యక్షం.. ఇంతకీ ఏం జరిగిందంటే..
ప్రతీకాత్మక చిత్రం

ఫుల్‌గా మందు కొట్టి ఇంటికొచ్చిన భర్తకు ఆమె ఏమాత్రం విసుక్కోకుండా సపర్యలు చేసింది. ఆకలి అనడంతో భోజనం తీసుకొద్దామని హోటల్ వద్దకు బయలుదేరింది. అయితే మధ్యలో ఆమెను కొందరు గమనిస్తూ వెళ్లారు. నిర్మానుష్య ప్రదేశంలోకి వెళ్లగానే బలవంతంగా పక్కకు లాక్కెళ్లారు. వదిలిపెట్టండని వేడుకుంటున్నా వినకుండా ఆమెపై దారుణానికి తెగబడ్డారు. చివరకు ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


రాజస్థాన్ (Rajasthan) రాష్ట్ర జైపూర్ పరిధిలో 35 ఏళ్ల ఓ మహిళ.. భర్తతో కలిసి నివాసం ఉంటోంది. ఈమె భర్త మద్యానికి బానిసై.. రోజూ తాగి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి కూడా ఫుల్‌గా తాగి వచ్చాడు. అయినా ఆమె విసుక్కోకుండా అతడికి సపర్యలు చేసింది. అయితే ఆకలి వేస్తోందని అనగడంతో సమయానికి ఇంట్లో ఏవీ లేకపోవడంతో బయట హోటల్‌కు బయలుదేరింది. దారి మధ్యలో ఐదుగురు వ్యక్తులు ఆమెను గమనిస్తూ వెనుకే వెళ్లారు.

Viral Video: మహిళ వెనుకే వెళ్లిన నక్క.. ఆదమరచి ఉన్న సమయంలో.. అదును చూసి ఒక్కసారిగా..


రైల్వే పట్టాల సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో ఆమెపై ఒక్కసారిగా దాడికి (Assault on woman) పాల్పడ్డారు. బలవంతంగా ఆమెను రైలు పట్టాల వద్దు లాక్కెళ్లి.. మూకుమ్మడిగా అత్యాచారానికి పాల్పడ్డారు. అర్ధరగ్నంగా ఉన్న ఆమెను అక్కడే వదిలేసి పారిపోయారు. సమాచారం అందుకున్న మహిళా పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెకు దుస్తులు అందించారు. అనంతరం బాధితురాలిని వైద్య పరీక్షల (Medical tests) నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలంలో ఆధారాలను సేకరించిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

తీర్థం తీసుకోగానే మూర్ఛపోతున్న యువతి.. ఐదేళ్ల అనంతరం పెళ్లి ప్రయత్నాలు చేస్తుండగా.. అసలు విషయం తెలిసి..



Updated Date - 2022-08-26T01:08:53+05:30 IST