రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు

ABN , First Publish Date - 2022-08-12T06:02:56+05:30 IST

మండలంలోని కస్తూర్బా బాలికల విద్యాలయం సమీపంలో గురువారం ఓ వాహనం బోల్తాపడి ఐదుగురు గాయపడ్డారు.

రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు

గడివేముల, ఆగస్టు 11: మండలంలోని కస్తూర్బా బాలికల విద్యాలయం సమీపంలో గురువారం ఓ వాహనం బోల్తాపడి ఐదుగురు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు కె.బొల్లవరం గ్రామంలో వివాహ కార్యక్రమానికి బూజనూరు గ్రామానికి చెందిన డ్రమ్ము కళాకారులు ఓ వాహనంలో వెళ్తుండగా కస్తూర్బా బాలికల విద్యాలయం సమీపంలో గొర్రెలు అడ్డుగా రావడంతో వాహనం తప్పించబోయి ప్రమాదశాత్తు బోల్తాపడింది. దీంతో నాగేంద్ర, పెద్దరాయుడు, శ్రీరాములు, మాస్‌, మహేష్‌ గాయపడ్డారు. వీరిలో నాగేంద్ర, పెద్దరాయుడులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Updated Date - 2022-08-12T06:02:56+05:30 IST