మత్స్యకార్మికులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

ABN , First Publish Date - 2021-10-27T04:13:19+05:30 IST

మత్స్యకార్మికులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

మత్స్యకార్మికులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి
చెర్లపటేల్‌గూడలో వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసిన సందర్బంగా విజయకేతనం చూపుతున్న ఎంపీపీ

  • ఎంపీపీ కృపేష్‌


ఇబ్రహీంపట్నం రూరల్‌: మత్స్య కార్మికులు ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందాలని ఎంపీపీ కృపేష్‌ అన్నారు. మంగళవారం మండల పరిధి రాయపోల్‌, నాగంపల్లి గ్రామాల్లోని చెరువుల్లో మూడున్నర లక్షల చేప పిల్లలను వదిలారు. ఆయన మాట్లాడుతూ కులవృత్తులను ప్రోత్సహిస్తూ సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. మండల పరిధిలోని చెర్లపటేల్‌ గూడలో వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తయిందని ఎంపీపీ కృపేష్‌ అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ అభిరాంను అభినందించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మహే్‌షబాబు, సర్పంచ్‌ గీతారాంరెడ్డి,ఉపసర్పంచ్‌ నరేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-27T04:13:19+05:30 IST