మొదటిసారిగా న్యూరో ఆంజియోగ్రఫీ
ABN , First Publish Date - 2021-02-27T05:36:26+05:30 IST
బ్రెయిన్ స్ర్టోక్కు గురైన రోగికి నిర్వహించే న్యూరో ఆంజియోగ్రాఫ్ పరీక్ష కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చింది.
- అనంతపురం జిల్లావాసికి నిర్వహించిన వైద్యులు
కర్నూలు(హాస్పిటల్), ఫిబ్రవరి 26: బ్రెయిన్ స్ర్టోక్కు గురైన రోగికి నిర్వహించే న్యూరో ఆంజియోగ్రాఫ్ పరీక్ష కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చింది. ఈ నెల 24న అనంతపురం జిల్లాకు చెందిన ఓ రోగి బ్రెయిన్ స్ర్టోక్తో న్యూరో సర్జరీ వార్డులో చేరారు. హార్ట్ స్ర్టోక్ వస్తే రోగికి ఆంజియోగ్రఫీ చేసి లోపాలను గుర్తించి చికిత్స అందిస్తారు. అలాగే బ్రెయిన్ స్ర్టోక్ వచ్చిన రోగికి న్యూరో ఆంజియోగ్రాఫి నిర్వహించి మెదడులో దెబ్బతిన్న భాగాలను గుర్తించి మెరుగైన చికిత్స అందించవచ్చు. శుక్రవారం న్యూరో ఆంజియోగ్రఫీని కార్డియాలజీ విభాగం క్యాత్ ల్యాబ్లో డా.మోహన్ శశాంక్తో పాటు అనస్థీషియా వైద్యులు డా.శారద, శ్రీలత నిర్వహించారు. మొట్టమొదటి సారిగా న్యూరో ఆంజియోగ్రఫీ చేసిన డా.మోహన్ శశాంక్ను న్యూరో సర్జరీ వైద్యులు డా.వర్మ, డా.పుండరీకాక్షయ్య, డా.బాలాజీ అభినందించారు.