ఝార్ఖండ్లో తొలి కరోనా పాజిటివ్ కేసు
ABN , First Publish Date - 2020-04-01T01:24:55+05:30 IST
ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న కోవిడ్-19 వైరస్ ప్రభావం ఝార్ఖండ్ రాష్ట్రంపై కూడా పడింది. రాష్ట్ర రాజధాని రాంచీలో మలేషియా దేశస్తురాలికి కరోనా వైరస్ సోకినట్లు
రాంచీ: ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న కోవిడ్-19 వైరస్ ప్రభావం ఝార్ఖండ్ రాష్ట్రంపై కూడా పడింది. రాష్ట్ర రాజధాని రాంచీలో మలేషియా దేశస్తురాలికి కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. మలేషియా నుంచి భారత్కు వచ్చిన సదరు మహిళ లాక్డౌన్ విధించడంతో.. అప్పటి నుంచి 24 మందితో కలిసి ఓ మసీదులో నివాసం ఉంటుంది.
అయితే ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్గా ఫలితం వచ్చింది. దీంతో ఆమెను హింద్పిడీ ప్రాంతానికి చెందిన ఖేల్ గావ్లోని ఆసుపత్రికి తరలించి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నామని, ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని ఝార్ఖండ్ ఆరోగ్యశాఖ కార్యదర్శి నితిన్ మదన్ కులకర్ణి తెలిపారు.