భువనేశ్వర్ మురికివాడలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2020-06-06T18:48:04+05:30 IST

ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ నగరంలోని మురికివాడలో ఒకరికి కరోనా వైరస్ సోకడంతో కలకలం రేగింది....

భువనేశ్వర్ మురికివాడలో కరోనా కలకలం

భువనేశ్వర్ (ఒడిశా): ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ నగరంలోని మురికివాడలో ఒకరికి కరోనా వైరస్ సోకడంతో కలకలం రేగింది. భువనేశ్వర్ నగరంలోని సాలియా సాహి మురికివాడలో ఒకరికి కరోనా సోకడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. భువనేశ్వర్ నగరంలోని అతిపెద్ద మురికివాడ అయిన సానియా సాహిలో హోటళ్లు, రెస్టారెంట్లలో పనిచేస్తున్న వేలాదిమంది కార్మికులు నివాసముంటున్నారు.భువనేశ్వర్ లో ఒక్కరోజే మొత్తం 13 కరోనా కేసులు బయటపడ్డాయి. ఇప్పటికే ముంబైలోని అతిపెద్ద మురికివాడ అయిన ధారావీలో కరోనా కేసుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో భువనేశ్వర్ మురికివాడలో కరోనా ప్రబలకుండా వైద్యాధికారులు ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నారు. మినీ ఒడిశాగా పేరొందిన ఈ మురికివాడలోని 250 ఎకరాల్లో 9వేల గుడిసెల్లో వేలాది కార్మికులు నివాసముంటున్నారు. మురికివాడలో స్ప్రేయింగ్ చేయించడంతోపాటు సామాజిక దూరం పాటించాలని, ముఖానికి మాస్క్ లు ధరించాలని అధికారులు సూచించారు. 

Updated Date - 2020-06-06T18:48:04+05:30 IST