కోళ్లఫాంలో అగ్నిప్రమాదం.. 2,500 కోళ్లు మృతి

ABN , First Publish Date - 2020-06-07T16:03:32+05:30 IST

మధ్యాహ్నం కోళ్లఫాంలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి.

కోళ్లఫాంలో అగ్నిప్రమాదం.. 2,500 కోళ్లు మృతి

చెన్నై : ఉళుం దూర్‌పేట సమీపంలో ఉన్న కోళ్లఫాంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 2,500 కోళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఉళుందూర్‌పేట సమీపం నత్తామూరు గ్రామానికి చెందిన దేవేంద్రన్‌ అత్తిపాక్కం రోడ్డులో కోళ్లఫాం నడుపుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం కోళ్లఫాంలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఉళుందూర్‌పేట అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొనేలోపే 2,500లకు పైగా కోళ్లు కాలి బూడిదయ్యాయి. దీనిపై తిరునావలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Updated Date - 2020-06-07T16:03:32+05:30 IST