ముగిసిన జవాన్ అంత్యక్రియలు
ABN , First Publish Date - 2022-05-21T05:51:21+05:30 IST
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విధి నిర్వహణలో గుండెపోటుతో మృతి చెందిన జవాన్కు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలను శుక్రవారం నిర్వహించారు.
పత్తికొండ రూరల్, మే 20:
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విధి నిర్వహణలో గుండెపోటుతో మృతి చెందిన జవాన్కు
సైనిక లాంఛనాలతో అంత్యక్రియలను శుక్రవారం నిర్వహించారు. మండలంలోని హోసూరు
గ్రామానికి చెందిన మాబుసాహెబ్ (40) బీఎ్సఎ్ఫలో జవాన్గా విధులు
నిర్వహిస్తున్నాడు. రెండు రోజుల క్రితం విధులు నిర్వహిస్తున్న సమయంలోనే
తీవ్ర గుండెపోటుతో మృతి చెందారు. దీంతో తోటి జవాన్లు, బీఎ్సఎఫ్
అధికారులు మృతదేహాన్ని శుక్రవారం హోసూరు గ్రామానికి తీసుకుని వచ్చారు.
జవాన్కు నివాళి అర్పించిన అనంతరం సైనిక లాంఛనాలతో గాలిలో కాల్పులు జరిపి
గౌరవవందనంతో అంత్యక్రియలు నిర్వహించారు.