స్నేహితుడి కుటుంబానికి ఆర్థికసాయం
ABN , First Publish Date - 2022-06-16T05:22:17+05:30 IST
స్నేహితుడి కుటుంబానికి ఆర్థికసాయం
ఘట్కేసర్ రూరల్, జూన్ 15 : తమతో పాటు చదువుకొని ఇటీవల మృతిచెందిన స్నేహితుడి కుటు ంబానికి తోటి విద్యార్థులు ఆర్థికసాయం అందజేశారు. ఎదులాబాద్ జిల్లా పరిషత్ పాఠశాలలో 1993-94 బ్యాచ్కు చెంది న విద్యార్థి మాచర్ల రమేష్ అనారోగ్యంతో ఇటీవల మృతిచెందాడు. దీంతో అతడి స్నేహితులు రమేష్ కుటుంబసభ్యులకు బుధవారం సాయంత్రం రూ.45 వేల ఆర్థికసాయం అందజేశారు.
- బాధిత కుటుంబానికి రూ.20 వేలు అందజేత
నవాబుపేట, జూన్ 15 : నవాబుపేట గ్రామానికి చెందిన ఫత్యేపురం కృష్ణారెడ్డి(85) ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు శేరి నర్సింగ్రావు మృతిడి కుటుంబానికి బుధవారం రూ.20వేల ఆర్థికసాయం అందజేశారు. బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు హనుమంత్, విజయ, రాఘవేంద్రచార్యులు, సుబాన్ రంగారెడ్డి, నర్సింగ్ రావు, శివ తదితరులు పాల్గొన్నారు.