మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం

ABN , First Publish Date - 2022-10-08T04:07:13+05:30 IST

మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం

మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం
ఆర్థికసాయం అందజేస్తున్న సర్పంచ్‌ గోపాల్‌రెడ్డి, ఈశ్వర్‌గౌడ్‌

కందుకూరు/తలకొండపల్లి, అక్టోబరు 7: తిమ్మాపురం గ్రామానికి చెందిన మంద అంజయ్య, బుట్టి ఆంజయ్యలు ఇటీవల అనార్యోగంతో మృతిచెందగా బాధిత కుటుంబాలను  సర్పంచ్‌ గోపాల్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ వట్నాల ఈశ్వర్‌గౌడ్‌లు శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబసభ్యులకు రూ.5వేల చొప్పున ఆర్థికసాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ సన్నీళ్ల శ్రీరాములు, నాయకులు సన్నీళ్ల నర్సింహ, యాదగిరి, జ్ఞానేశ్వర్‌, డి.సురేష్‌, జి.అంజయ్య, ఎన్‌.యాదయ్య, డి.నర్సింహ పాల్గొన్నారు. 

 పడకల్‌లో.. 

తలకొండపల్లి మండలం పడకల్‌ గ్రామానికి చెందిన కృష్ణయ్య అనారోగ్యంతో మృతిచెందగా ఆయన భౌతిక కాయాన్ని శుక్రవారం టీఆర్‌ఎస్‌ జిల్లా సీనియర్‌ నాయకుడు సీఎల్‌ శ్రీనివా్‌సయాదవ్‌ సందర్శించి నివాళులర్పించారు. మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించి రూ.5వేలు ఆర్థికసాయం అందజేశారు. పరామర్శించిన వారిలో సర్పంచ్‌ రమేశ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శంకర్‌, ఉపసర్పంచ్‌ నర్సింహ యాదవ్‌, నాయకులు మురళీధర్‌రెడ్డి, అజయ్‌గౌడ్‌, స్వామిగౌడ్‌, శ్రీశైలం, దాసు, ఉన్నారు.  

Updated Date - 2022-10-08T04:07:13+05:30 IST