కరుణానిధి ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం
ABN , First Publish Date - 2021-05-17T15:40:02+05:30 IST
కలైంజర్ కరుణానిధి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు అందజేసే ఆర్థికసాయాన్ని ఈ సంవత్సరం లాక్డౌన్ కారణంగా పోస్టు ద్వారా..
చెన్నై/అడయార్: కలైంజర్ కరుణానిధి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు అందజేసే ఆర్థికసాయాన్ని ఈ సంవత్సరం లాక్డౌన్ కారణంగా పోస్టు ద్వారా పంపించారు. ఈ యేడాది కూడా 8 మంది విద్యార్థులకు రూ.25 వేల ఆర్థికసాయం చేశారు. ఎంపిక చేసిన విద్యార్థు లకు పోస్టు ద్వారా ఈ ఆర్థిక సాయం చెక్కులను పంపించారు. కాగా, ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటివరకు రూ.5,27,90,000ల ఆర్థిక సాయాన్ని అర్హులైన పేద విద్యార్థులకు అందజేశారు.