‘బాధ్యులపై అట్రాసిటీ కేసు నమోదు చేయండి’

ABN , First Publish Date - 2022-05-29T06:04:37+05:30 IST

కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరును వ్యతిరేకిస్తూ విధ్వంసాన్ని సృష్టించిన దుండగులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి శిక్షించాలని సమతా సైనిక్‌ దళ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా రామారావు డిమాండ్‌ చేశారు. శనివారం మండల పరిషత్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.

‘బాధ్యులపై అట్రాసిటీ కేసు నమోదు చేయండి’
అంబేడ్కర్‌ విగ్రహానికి పాలభిషేకం చేస్తున్న దృశ్యం


కోటబొమ్మాళి: కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరును వ్యతిరేకిస్తూ విధ్వంసాన్ని సృష్టించిన దుండగులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి శిక్షించాలని సమతా సైనిక్‌ దళ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా రామారావు డిమాండ్‌ చేశారు. శనివారం మండల పరిషత్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోనసీమ జిల్లాను అంబేడ్కర్‌ కోన సీమ జిల్లాగా కొనసాగించాలని కోరారు. మాజీ కారు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును కఠి నంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సామ సంజీవరావు, కె.భాస్కర్‌రావు, కుంచి అంజి పాల్గొన్నారు. 


అంబేడ్కర్‌ విగ్రహానికి పాలభిషేకం

పాతపట్నం: కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరును ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన విధ్వంసాన్ని ఖండిస్తూ శనివారం స్థానిక కోర్టు కూడలిలో అంబేడ్కర్‌ యువజన సంఘం ప్రతినిధులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్‌ సుదర్శనం, యజ్జల భాస్కరరావు మాట్లాడుతూ.. కోనసీమకు అంబేడ్కర్‌ జిల్లాగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. అంబేడ్కర్‌ విగ్ర హానికి పాలభిషేకం చేశారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు సిర్ల ప్రభాకరరావు, సిర్ల జోగారావు, కొప్పల అప్పారావు, దార గరికయ్య,  తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-05-29T06:04:37+05:30 IST