న్యాయం జరిగే వరకూ పోరాటం: ఎంపీ కేవీఆర్‌

ABN , First Publish Date - 2021-01-19T06:14:45+05:30 IST

వైటీడీఏ అభివృద్ధిలో భాగంగా పట్టణంలో గృహా లు, దుకాణాలు, భూములు కోల్పోయిన బాధితులందరికీ సముచిత న్యాయం జరిగే వరకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భరోసా ఇచ్చారు.

న్యాయం జరిగే వరకూ పోరాటం: ఎంపీ కేవీఆర్‌
దీక్షనుద్దేశించి మాట్లాడుతున్న ఎంపీ వెంకట్‌రెడ్డి

యాదాద్రి రూరల్‌, జనవరి 18: వైటీడీఏ అభివృద్ధిలో భాగంగా పట్టణంలో గృహా లు, దుకాణాలు, భూములు కోల్పోయిన బాధితులందరికీ సముచిత న్యాయం జరిగే వరకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భరోసా ఇచ్చారు. పట్టణంలో నాలుగు రోజుల నుంచి భూ నిర్వాసితులు, ఇళ్ల యజమానులకు న్యాయం జరిగేందుకు కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన రిలే దీక్షలకు సోమవారం ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చి విఫలమయ్యారని అన్రాఉ. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల అయిలయ్య, ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న,  గుండ్లపల్లి భతర్‌గౌడ్‌, ఎంపీపీ చీర శ్రీశైలం,  గుడ్ల వరలక్ష్మి, గుండ్లపల్లి వాణిభరత్‌గౌడ్‌, సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు బీర్ల శంకర్‌, ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2021-01-19T06:14:45+05:30 IST