ఫీవర్ సర్వే వేగవంతం
ABN , First Publish Date - 2022-01-22T04:48:12+05:30 IST
జ్వరాలపై చేపట్టిన సర్వేను వేగవంతం చేయాలని జేసీ వెంకటరావు వైద్య సిబ్బందిని ఆదేశిం చారు. శుక్రవారం సాయంత్రం కర్లాం పీహెచ్సీని ఆకస్మి కంగా సందర్శించారు.
పీహెచ్సీ సిబ్బందికి జేసీ ఆదేశం
చీపురుపల్లి: జ్వరాలపై చేపట్టిన సర్వేను వేగవంతం చేయాలని జేసీ వెంకటరావు వైద్య సిబ్బందిని ఆదేశిం చారు. శుక్రవారం సాయంత్రం కర్లాం పీహెచ్సీని ఆకస్మి కంగా సందర్శించారు. ఈ సందర్భంగా సీహెచ్సీలో రోగు లకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. కొవిడ్ పరీక్షలు, వ్యాక్సినేషన్ తదితర కార్యక్రమాలను అడిగి తెలుసు కున్నారు. ప్రస్తుత సీజన్లో వైరల్ జ్వరాల వ్యాప్తి ఎక్కు వగా ఉందని, సర్వేను వేగవంతం చేయాలని కోరారు. సర్వేలో గుర్తించిన జ్వర పీడితులకు అవసరమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. తహసీల్దార్ ఎం. సురేష్, డీటీ సంతోష్, వైద్యాధికారి సువర్ణ, ఎంపీహెచ్ ఈవో ఎల్. అప్పలనాయుడు ఉన్నారు.