నిసర్గ తుఫాన్: విమానాన్ని రన్వే నుంచి తోసేసిన గాలి!
ABN , First Publish Date - 2020-06-04T04:15:12+05:30 IST
మహారాష్ట్రపై నిసర్గ తుఫాను విరుచుకుపడుతోంది. ఈ తుఫాను గాలులకు ఇళ్లపై ఉన్న రేకుల పైకప్పులు కూడా ఎగిరిపోతున్నాయి.
ముంబై: మహారాష్ట్రపై నిసర్గ తుఫాను విరుచుకుపడుతోంది. ఈ తుఫాను గాలులకు ఇళ్లపై ఉన్న రేకుల పైకప్పులు కూడా ఎగిరిపోతున్నాయి. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండవుతున్న విమానాన్ని తుఫాను గాలులు నెట్టేశాయి. బెంగళూరు నుంచి ముంబై వచ్చిన ఈ విమానం ఫెడ్ఎక్స్ సంస్థకు చెందినది. ఈ విమానం ల్యాండయ్యే సమయంలో తుఫాను గాలుల ధాటికి రన్వే నుంచి పక్కకు వెళ్లిపోయింది. దీంతో విమానాశ్రయంలో విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.