కరోనాపై సంచలన ఫత్వా జారీ చేసిన దారుల్ ఉలూమ్

ABN , First Publish Date - 2020-04-03T00:45:18+05:30 IST

ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్‌పై లక్నోలోని దారుల్ ఉలూమ్ ఫిరంగీ మహాలీ ఇవాళ సంచలన ఫత్వా జారీ చేసింది...

కరోనాపై సంచలన ఫత్వా జారీ చేసిన దారుల్ ఉలూమ్

లక్నో: ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్‌పై లక్నోలోని దారుల్ ఉలూమ్ ఫిరంగీ మహాలీ ఇవాళ సంచలన ఫత్వా జారీ చేసింది. ప్రజలంతా కరోనా వైరస్ పరీక్షలు చేయించుకోవాలనీ.. ఏమాత్రం సంశయించకుండా వైద్య సహాయం పొందాలని ఆదేశించింది. కోవిడ్-19 లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి అని మౌలానా ఖలీద్ రషీద్ ఫిరంగీ మహాలీ స్పష్టం చేశారు. దియోబంద్‌కు చెందిన ఓ న్యాయవాది అడిగిన ప్రశ్నకు స్పందనగా ఈ మేరకు ఫత్వా జారీ చేసినట్టు సమాచారం. ప్రభుత్వం సూచించిన అన్ని జాగ్రత్తలను ప్రజలు విధిగా పాటించాలనీ మౌలానా సూచించారు. షరియత్ చట్టం ప్రకారం, ఇస్లాంను అనుసరించే వారంతా తమ జీవితాలను కాపాడుకోవడంతో పాటు ఇతరులకు కూడా హాని జరగనివ్వరాదని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2020-04-03T00:45:18+05:30 IST