కరోనా తెచ్చిన శుభవార్త.. పాకిస్థాన్కు ఊరట
ABN , First Publish Date - 2020-04-09T00:08:07+05:30 IST
కరోనా మహమ్మారితో అల్లాడుతున్న పాకిస్థాన్..కరోనా కారణంగా ఓ శుభావార్త వినాల్సి వచ్చింది. జూన్ నెలలో జరగాల్సిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ పోర్స్(ఎఫ్ఏటీఎఫ్) సమావేవం కరోనా కారణంగా వాయిదా పడినట్టు తెలుస్తోంది.
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో అల్లాడుతున్న పాకిస్థాన్..అదే కరోనా కారణంగా ఓ శుభావార్త వినాల్సి వచ్చింది. జూన్ నెలలో జరగాల్సిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ పోర్స్(ఎఫ్ఏటీఎఫ్) సమావేవం కరోనా కారణంగా వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఉగ్రవాదానికి నిధులందకుండా చేసేందుకు పాక్ చేపట్టిన చర్యలపై ఈ సమావేశంలో సమీక్షించాల్సి ఉంది. కానీ కరోనా కల్లోలం కారణంగా ఇది కాస్తా వాయిదా పడటంతో పాక్కు ఊహించని ఊరట లభించినట్టైంది. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా గతంలో తాము సూచించిన 24 పాటింట్ల ప్రణాళికను పాక్ ఏమేరకు అములు చేసిందనే దానిపై ఎఫ్ఏటీఎఫ్ జూన్లో సమీక్షిస్తామంటూ ఓ డెడ్ లైన్ విధించింది. అయితే సభ్యదేశాలు ఆశించిన పనీతీరును పాక్ కనబరచలేని పక్షంలో ఆ దేశాన్ని బ్లాక్ లిస్టులో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పాక్ ప్రస్తుతం గ్రే లిస్టులో కొనసాగుతోంది. అయితే ఈ సమావేశాలు వాయిదాతో పాక్ తాత్కాలిక ఊరట లభించింది. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ పాకిస్థాన్ గ్రే లిస్టులో కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.