గుజరాత్ లో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

ABN , First Publish Date - 2020-04-04T23:40:55+05:30 IST

గుజరాత్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. సురేందర్ నగర్ సమీపంలో...

గుజరాత్ లో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

అహ్మదాబాద్: గుజరాత్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. సురేందర్ నగర్ సమీపంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. శనివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. కారులో పని మీద ఆ కుటుంబం బయటకు వెళ్ళింది. లింబిడి-అహ్మదాబాద్ రహదారిపై కారు ప్రయాణిస్తుండగా ఎదురుగా వెళ్తున్న ఓ లారీని.. ఆ కారు బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి చికిత్స పొందుతున్నాడని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-04-04T23:40:55+05:30 IST