రైతుల నడ్డివిరిచేందుకే ‘మోటార్లకు మీటర్లు’

ABN , First Publish Date - 2020-10-17T11:27:57+05:30 IST

రైతుల నడ్డివిరిచే కార్యక్రమమే మోటా ర్లకు మీటర్లు బిగింపు’ అని తిరుమలంపాలెం రైతులు ఆందోళన చేశారు.

రైతుల నడ్డివిరిచేందుకే ‘మోటార్లకు మీటర్లు’

తిరుమలంపాలెంలో రైతులు ఆందోళన 


ద్వారకా తిరుమల, అక్టోబరు 16: ‘రైతుల నడ్డివిరిచే కార్యక్రమమే మోటా ర్లకు మీటర్లు బిగింపు’ అని తిరుమలంపాలెం రైతులు ఆందోళన చేశారు. స్థానిక సొసైటీ కార్యాలయం వద్ద మోటార్లకు మీటర్ల బిగింపుపై రైతు లకు అవగాహన సదస్సును ఎం.నాగులపల్లి సెక్షన్‌ విద్యుత్‌ శాఖ ఏఈ జి.శ్రీనివాస్‌ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. అయితే రైతులు అవగాహన సదస్సు ను అడ్డుకుని.. రైతులు నష్టపోతారంటూ నినాదాలు చేశారు. రైతు వ్యతిరేక విధానాలను అనుసరించే ఏ ప్రభుత్వం అధికారంలో నిలబడలేదన్నారు. అనంతరం రాజపాలెంలో జరిగిన గ్రామసభను రైతులు అడ్డుకున్నారు. కార్యక్రమంలో రైతులు మాసిరెడ్డి గాంధీ, పావులూరి మధుబాబు, పావులూరి నెహ్రూ, పాకలపాటి రామచంద్రరావు, శ్రీనివాసరావు, రాజుపాలెం లో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు డీవీఎస్‌ చౌదరి పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-17T11:27:57+05:30 IST