రైతులందరి ధాన్యాన్ని కొంటాం: ఆర్డీవో
ABN , First Publish Date - 2020-12-05T06:59:40+05:30 IST
ఖరీఫ్ సీజన్లో పండించిన ధాన్యాన్ని రైతులం దరి నుంచీ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఆందోళన చెందవద్దని కాకినాడ ఆర్డీవో చిన్నికృష్ణ పేర్కొన్నారు.
సామర్లకోట, డిసెంబరు 4: ఖరీఫ్ సీజన్లో పండించిన ధాన్యాన్ని రైతులం దరి నుంచీ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఆందోళన చెందవద్దని కాకినాడ ఆర్డీవో చిన్నికృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం సామర్లకోట మండలం ఉండూరు పీఏసీఎస్ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. కళ్లాల్లోని ధాన్యం రాశులను పరిశీలించి నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేయాలని సూచించారు. రైతుల నమోదులు, కూపన్ల పంపిణీ, నమోదు ప్రక్రియ రికార్డులను ఆర్డీవో పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆయన వెంట తహసీల్దార్ వజ్రపు జితేంద్ర, వీఆర్వో వెంకటేశ్వరరావు ఉన్నారు.