రోడ్డు పనులను అడ్డుకున్న రైతులు

ABN , First Publish Date - 2021-10-24T06:15:26+05:30 IST

మండలంలోని నల్లగుట్టపల్లి రోడ్డు పను లను రైతులు అడ్డుకున్నారు.

రోడ్డు పనులను అడ్డుకున్న రైతులు

నంబులపూలకుంట,  అక్టోబరు 23: మండలంలోని నల్లగుట్టపల్లి రోడ్డు పను లను రైతులు అడ్డుకున్నారు. మరికొమ్మదిన్నె నుండి నల్లగుట్టపల్లికి వెళ్ళే రహదారిలో రైతుల పట్టాలు ఉండటంతో వారు రస్తాకు సహకరించక పోవడంతో ఆ వివాదం అలాగే కొనసాగుతోంది. ప్రస్తుతం పీఆర్‌ ప్యాకేజీ రూ. 70 లక్షలు వ్యయంతో మరి కొమ్మదిన్నె నుంచి నల్లగు ట్టపల్లి వరకు రోడ్డు మంజూరు అయ్యింది. శనివా రం సీఐ రూరల్‌ మధు పోలీసులు అక్కడకు చేరుకుని రోడ్డు పనులను ప్రారంభించారు. పట్టాభూములు కావడంతో ఆ భూముల రైతులు రోడ్డు వేయడానికి ససేమిరా అం టూ అడ్డుకున్నారు.    రెవెన్యూ అధికారులు రైతులతో మాట్లాడి సానుకూ లంగా ఈ సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. రహ దారికి నిధులు మంజూరు కావడంతో ఎలాగైనా ఆ గ్రామానికి రహదారి వేయాలని స్థానిక వైసీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు ఇబ్బం ది లేకుండా గ్రామానికి రహ దారి వేస్తే తమకు అభ్యంతరం లేదని రైతులు చెబుతున్నారు. అయితే అధికారులు దౌర్జన్యంగా మా భూమిలో రహదారి వేస్తే తాము ఒప్పుకోమని రైతులు చెప్పారు. 

Updated Date - 2021-10-24T06:15:26+05:30 IST