‘రైతులు నూతన పద్ధతులు పాటించాలి’
ABN , First Publish Date - 2022-01-29T04:51:25+05:30 IST
ఫౌండేషన్ సీడ్ను రైతులే తయారు చేసుకోవచ్చని, అధిక దిగుబడుల కోసం రైతులు ఎప్పటికప్పుడు నూతన సస్యరక్షణ పద్ధతులు అనుసరించాలని ఏడీఏ విజయశేఖర్, ఏవో శ్రావణి రైతులకు సూచించారు.
నందికొట్కూరు రూరల్, జనవరి 28: ఫౌండేషన్ సీడ్ను రైతులే తయారు చేసుకోవచ్చని, అధిక దిగుబడుల కోసం రైతులు ఎప్పటికప్పుడు నూతన సస్యరక్షణ పద్ధతులు అనుసరించాలని ఏడీఏ విజయశేఖర్, ఏవో శ్రావణి రైతులకు సూచించారు. శుక్రవారం నందికొట్కూరు మండలంలోని పది బొల్లవరంలో రైతుల శనగ, మినుము పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు జాతీయ ఆహార భద్రతా మిషన్(ఎన్ఎఫ్ఎస్ఎం) పథకం కింద శనగ విత్తనాలను ఉచితంగా అందజేశామని తెలిపారు. ఆ పంటలు ఇప్పుడు కోతకు వచ్చాయని అన్నారు. శనగ పంట ఎకరాకు పది క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని తెలియజేశారు. విత్తనాలు ఫౌండేషన్ సీడ్ కాబట్టి శుద్ధి చేసుకుని జాగ్రత్తలతో దాచి పెట్టుకుంటే వచ్చే ఖరీఫ్ కాలానికి ఈ విత్తనాన్ని ఫౌండేషన్ సీడ్గా వాడుకోవచ్చన్నారు.