గుణపాఠం ఎలా చెప్పాలో మాకు తెలుసు..రాకేశ్ టికాయత్ హెచ్చరిక

ABN , First Publish Date - 2021-07-25T01:59:53+05:30 IST

రైతు నేత రాకేశ్ టికాయత్ కేంద్ర ప్రభుత్వానికి మరో హెచ్చరిక చేశారు. తమను పట్టించుకోని వారికి ఎలా బుద్ధి చెప్పాలో రైతులకు తెలుసంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు.

గుణపాఠం ఎలా చెప్పాలో మాకు తెలుసు..రాకేశ్ టికాయత్ హెచ్చరిక

న్యూఢిల్లీ: రైతు నేత రాకేశ్ టికాయత్ కేంద్ర ప్రభుత్వానికి మరో హెచ్చరిక చేశారు. తమను పట్టించుకోని వారికి ఎలా బుద్ధి చెప్పాలో రైతులకు తెలుసంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ‘‘ఈ గుడ్డి, చెవిటి ప్రభుత్వాన్ని రైతు ఉద్యమం తట్టి లేపింది. తనను పట్టించుకోని వారికి ఎలా బుద్ధి చెప్పాలో రైతుకు బాగా తెలుసు. ఈ విషయాన్ని ఎవరూ మర్చిపోకూడదు’’ అని ఆయన ట్వీట్ చేశారు. భారత్ దేశం స్వేచ్ఛ, ఆత్మను పరిరక్షించుకునేందుకు రైతులందరూ ఏకం కావాలని కూడా పిలుపునిచ్చారు. పార్లమెంట్ వద్ద మూడు రోజులుగా రైతు నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ టికాయత్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2021-07-25T01:59:53+05:30 IST