రైతు ఆత్మహత్యలపై విచారణ జరపాలి

ABN , First Publish Date - 2021-04-16T05:20:11+05:30 IST

రైతు అత్మహత్యలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుం బాలకు పరిహారం ఇవ్వాలని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న డిమాండ్‌ చేశారు. మండలంలోని కౌఠ-బి గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు సగ్గిడి సతీష్‌ కుటుంబాన్ని గురు వారం పరామర్శించారు.

రైతు ఆత్మహత్యలపై విచారణ జరపాలి
బాధిత కుటుంబ వివరాలను సేకరిస్తున్న బొర్రన్న

బోథ్‌ రూరల్‌, ఏప్రిల్‌ 15: రైతు అత్మహత్యలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుం బాలకు పరిహారం ఇవ్వాలని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న డిమాండ్‌ చేశారు. మండలంలోని కౌఠ-బి గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు సగ్గిడి సతీష్‌ కుటుంబాన్ని గురు వారం పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులను సతీష్‌ ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రెండు ఎకరాల సొంత భూమితో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడని ఈ క్రమంలో గత రెండేళ్లుగా దిగుబడి సరిగా రాక, తెచ్చిన అప్పుల భారం పెరగడంతో వాటిని ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురై అత్మహత్య చేసుకున్నట్లు పేర్కొ న్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన జీవో నెంబర్‌ 194 ప్రకారం 6 లక్షల రూపాయల పరిహారాన్ని, పిల్లలకు ఉన్నతమైన విద్య, వైద్య సదు పాయాలను కల్పించాలని కుటుంబ యజమాను రాలికి నెలకు 5 వేల రూపాయాల పెన్షన్‌ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-04-16T05:20:11+05:30 IST