రైతు వేదికలు అందుబాటులో ఉండేలా నిర్మించాలి
ABN , First Publish Date - 2020-08-04T10:45:54+05:30 IST
రైతులందరికీ సౌకర్యంగా ఉన్న గ్రామాల్లోనే రైతు వేదికలు నిర్మించాలని బీజేపీ ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతావత్ లాలూనాయక్ అన్నారు.
దేవరకొండ, ఆగస్టు 3 : రైతులందరికీ సౌకర్యంగా ఉన్న గ్రామాల్లోనే రైతు వేదికలు నిర్మించాలని బీజేపీ ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతావత్ లాలూనాయక్ అన్నారు. సోమవారం ఆయన పట్టణంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బెజవాడ శేఖర్, పార్లమెంట్ కన్వీనర్ నక్క వెంకటే్షయాదవ్లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. సమావేశంలో కందుకూరు సర్పంచ్ పావనినరేందర్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు గుండాల అంజయ్యయాదవ్, వనం పుష్పలత, జల్లా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కందుకూరు మంజూరైన రైతు వేదిక భవనాన్ని శాంతిగూడేనికి మార్చడాన్ని నిరసిస్తూ దేవరకొండలో బీజేపీ నాయకులు తమ ఇళ్లలో గంటపాటు మౌనదీక్ష చేపట్టి నిరసన తెలిపారు.