విద్యుదాఘాతంతో రైతు మృతి

ABN , First Publish Date - 2020-07-06T11:46:23+05:30 IST

విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని మునిగడపలో ఆదివారం చోటు చేసుకుంది.

విద్యుదాఘాతంతో రైతు మృతి

జగదేవ్‌పూర్‌, జూలై 5: విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని మునిగడపలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన మరాటి బాలమల్లు (50) తనకున్న ఎకరంన్నర భూమిలో పత్తి సాగు చేశాడు. ఆదివారం పొలం వద్దకు వెళ్లి మోటార్‌ను ఆన్‌ చేయగా, మోటార్‌ నడవకపోవడంతో తీగల సమస్య ఉందని ట్రాన్స్‌ఫార్మర్‌ను బంద్‌ చేసేందుకు వచ్చాడు. ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆన్‌, ఆఫ్‌ చేసే హ్యాండిల్‌ను పట్టుకోగా విద్యుత్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.


ఎస్‌ఐ పరమేశ్వర్‌ సంఘటన స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే తన భర్త మృతి చెందినట్లు భార్య మల్లమ్మ ఆరోపించారు. కాసేపు మృతదేహాన్ని అక్కడి నుంచి తీయకుండా కుటుంబీకులు ఆందోళన చేశారు. ఎస్‌ఐ పరమేశ్వర్‌ రైతు కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-07-06T11:46:23+05:30 IST