విద్యుదాఘాతంతో రైతు మృతి

ABN , First Publish Date - 2022-08-09T04:24:31+05:30 IST

లేటపల్లి పొలాల్లో సోమవారం ప్రమా దవశాత్తూ విద్యుదాఘాతానికి గురై అండ్లూరు కృష్ణారెడ్డి(65) మృతిచెందాడు.

విద్యుదాఘాతంతో రైతు మృతి
పొలంలోనే కృష్ణారెడ్డి మృతదేహం

కమలాపురం రూర ల్‌, ఆగస్టు 8: లేటపల్లి పొలాల్లో సోమవారం ప్రమా దవశాత్తూ విద్యుదాఘాతానికి గురై అండ్లూరు కృష్ణారెడ్డి(65) మృతిచెందాడు. ఎస్‌ఐ కొం డారెడ్డి ఇచ్చిన స మాచారం మేరకు వివరాల్లోకెళితే.... మాచునూరు వాసి కృష్ణారెడ్డి లేటపల్లి వద్ద రెండెకరాల పొలం సాగు చేసుకుంటున్నాడు. పొలానికి నీరు కట్టే ప్రయత్నంలో భాగంగా స్టార్టర్‌ వేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి దర్యాప్తు చేస్తు న్నారు. మృతుని భార్య సులోచనమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.


Updated Date - 2022-08-09T04:24:31+05:30 IST