రైతు భరోసా నిధులు రుణ ఖాతాలకు మళ్లింపు
ABN , First Publish Date - 2020-06-04T10:46:30+05:30 IST
రైతు భరోసా నిధులను రుణ ఖాతాల్లోకి మళ్లించడం పట్ల పిచ్చాటూరు మండలం నీరువాయి ..
పిచ్చాటూరు, జూన్ 3: రైతు భరోసా నిధులను రుణ ఖాతాల్లోకి మళ్లించడం పట్ల పిచ్చాటూరు మండలం నీరువాయి గ్రామానికి చెందిన రైతులు బుధవారం సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంకు మేనేజర్ గీతాంజలి నాయుడు రైతులను, వెలుగు సంఘాల సభ్యులను చులకనగా చూస్తున్నారని అన్నారు. ఆమె తీరు మార్చుకోకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.