ట్రైనీ కలెక్టర్ అపరాజితా సింగ్కు ఘనంగా వీడ్కోలు
ABN , First Publish Date - 2020-10-02T08:17:33+05:30 IST
కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట మండల కార్యాలయంలో గురువారం ఎంపీడీవో, ఇన్చార్జి సీఈవో పి.నారాయణమూర్తి ఆధ్వర్యంలో ట్రైనీ కలెక్టర్ అపరాజితా సింగ్ను ఘనంగా సత్కరించారు.
సర్పవరం జంక్షన్, అక్టోబరు 1: కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట మండల కార్యాలయంలో గురువారం ఎంపీడీవో, ఇన్చార్జి సీఈవో పి.నారాయణమూర్తి ఆధ్వర్యంలో ట్రైనీ కలెక్టర్ అపరాజితా సింగ్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన సభలో ట్రైనీ కలెక్టర్ అపరాజితాసింగ్ మాట్లాడుతూ శిక్షణలో భాగంగా ఆరువారాలపాటు ఇన్చార్జి ఎంపీడీవోగా విధులు నిర్వహించానని, శిక్ష పూర్తయిందని తెలిపారు. సచివాలయ వ్యవస్థల సక్రమ నిర్వహణ కోసం మరింత శ్రమించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవో ఎల్.గణేష్బాబు, సూపరింటెండెంట్ శ్రీని వాస్, ఇన్చార్జి ఎంపీడీవో బి.గోవిందరాజులు, కార్యదర్శులు ఎన్.వెంకటరెడ్డి, పిడుగు పాండురంగారావు, బీబీ, నాగవేణి, డి.వెంకటరమణ పాల్గొన్నారు.