నాలుగు రెట్లు పెరిగిన ఇమ్రాన్ భార్య ఫ్రెండ్ ఆస్తులు

ABN , First Publish Date - 2022-04-08T19:16:29+05:30 IST

ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి

నాలుగు రెట్లు పెరిగిన ఇమ్రాన్ భార్య ఫ్రెండ్ ఆస్తులు

ఇస్లామాబాద్ : ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి మూడు సంవత్సరాల్లో ఆయన సతీమణి బుష్రా బీబీ స్నేహితురాలు ఫరా ఖాన్ సంపద భారీగా పెరిగినట్లు పాకిస్థానీ మీడియా తెలిపింది. 2017లో ఆమె సంపద విలువ 231 మిలియన్ల పాకిస్థానీ రూపాయలు కాగా, 2021లో ఇది 971 మిలియన్ పాకిస్థానీ రూపాయలకు పెరిగిందని వెల్లడించింది. ఆమె ఆదాయపు పన్ను రిటర్న్‌ల ద్వారా ఈ వివరాలు తెలిసినట్లు పేర్కొంది.  2018లో ఆమె ఐటీ రిటర్న్‌లో ఆదాయం ‘నిల్’ అని పేర్కొన్నారని తెలిపింది.  


ఫరా ఖాన్, బుష్రా బీబీ అత్యంత సన్నిహిత మిత్రులు. ఇమ్రాన్ ఖాన్ వివాహం ఫరా ఖాన్ నివాసంలోనే జరిగింది. ఇదిలావుండగా, ఫరా ఖాన్ అవినీతికి పాల్పడ్డారని పాకిస్థానీ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పంజాబ్ ప్రావిన్స్‌లో అధికారులు, ఉద్యోగులకు ఇచ్చిన ప్రతి పోస్టింగ్‌కు, ప్రతి బదిలీకి మిలియన్ల రూపాయలను ఆమె తీసుకునేవారని ఆరోపిస్తున్నాయి. నల్లధనాన్ని అధికారిక ఆదాయంగా మార్చుకోవడం కోసం ట్యాక్స్ అమ్నెస్టీ స్కీమ్‌ను ఆమె వినియోగించుకున్నారని చెప్తున్నాయి. 


Updated Date - 2022-04-08T19:16:29+05:30 IST