రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతం చేయాలి
ABN , First Publish Date - 2022-07-02T05:39:43+05:30 IST
తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన నడు స్తోందని, రాబోయే ఎన్నికల్లో దానిని అంతం చేయాలని బీహార్ ఎంపీ గోపాల్జీ ఠాకూర్ అన్నారు.
- బీహార్ ఎంపీ గోపాల్జీ ఠాకూర్
పాలకుర్తి, జూలై 1: తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన నడు స్తోందని, రాబోయే ఎన్నికల్లో దానిని అంతం చేయాలని బీహార్ ఎంపీ గోపాల్జీ ఠాకూర్ అన్నారు. ఆయన శుక్రవారం మండలం లోని పుట్నూర్ గ్రామంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆధ్వర్యంలో కిసాన్ మోర్చా రైతులతో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జులై 3న నిర్వహిస్తున్న విజయ సంకల్ప సభకు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. నరేంద్ర మోడీ చేపట్టిన పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారా యణ, సోమారపు అరుణ్ కుమార్. మండల అధ్యక్షుడు పత్తి సంజీ వ్, బీజేపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.