10లోగా కుటుంబ వివరాలు సర్వే చేయాలి

ABN , First Publish Date - 2020-06-28T07:19:11+05:30 IST

జిల్లాలోని ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం కింద ఎంపిక చేసిన 18 గ్రామాల్లోని కుటుంబ వివరాలను జూలై 10వ తేదీలోగా సర్వే చేసి

10లోగా కుటుంబ వివరాలు సర్వే చేయాలి

కడప (కలెక్టరేట్‌), జూన్‌ 27 : జిల్లాలోని ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం కింద ఎంపిక చేసిన 18 గ్రామాల్లోని కుటుంబ వివరాలను జూలై 10వ తేదీలోగా సర్వే చేసి సమర్పించాలని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. శని వారం కలెక్టర్‌ ఛాంబరులో ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఎంపికైన 18 గ్రామాల్లో ఆయా మండలాభివృద్ధి అధికారులు సోషల్‌ సర్వే ద్వారా కుటుంబ వివరాలను సేకరించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ధి) సాయికాంత్‌వర్మ, జేసీ-2 శివారెడ్డి, శిక్షణ కలెక్టర్‌ వికాస్‌ మర్మాట్‌,  సాంఘీక సంక్షేమ శాఖ డీడీ జయప్రకాష్‌, డ్వామా పీడీ యధుభూషణ్‌రెడ్డి, డీపీవో ప్రభాకర్‌రెడ్డి, డీఎంహెచ్‌వోడాక్టర్‌ ఉమాసుందరి, సీపీవో తిప్పేస్వామి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ గోపాల్‌ తదితర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-28T07:19:11+05:30 IST