మందుపాతరకు బలైన గిరిజనుల కుటుంబాలు ధర్నా

ABN , First Publish Date - 2020-08-08T07:49:05+05:30 IST

ఇంజెరి అడవుల్లో మందుపాతరకు బలైపోయిన తమను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ మృతులు మోహనరావు, అజయ్‌కుమార్‌ కుటుంబ సభ్యులు శుక్రవారం..

మందుపాతరకు బలైన గిరిజనుల కుటుంబాలు ధర్నా

ఒక్కొక్క కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం చేసిన పీవో 


పాడేరు, ఆగస్టు 7: ఇంజెరి అడవుల్లో మందుపాతరకు బలైపోయిన తమను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ మృతులు మోహనరావు, అజయ్‌కుమార్‌ కుటుంబ సభ్యులు శుక్రవారం ఐటీడీఏ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. తమ సమస్యపై ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్‌కు వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన పీవో రూ.లక్ష చొప్పున మృతుల కుటుంబాలకు చెక్‌లను అందించారు. ప్రభుత్వం నుంచి అన్నివిధాల బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో ఐటీడీఏ ఏవో నాగేశ్వరరావు, డీఎస్‌పీ వీబీ.రాజ్‌కమల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-08-08T07:49:05+05:30 IST