ఫీజుల కోసం ఫెయిల్ చేయడం కిరాతకం
ABN , First Publish Date - 2022-08-13T05:13:08+05:30 IST
యోగివేమన విశ్వవిద్యాలయం డిగ్రీ, సెమిస్టర్ పరీక్షల్లో ఫీజులు కోసం అత్యధిక మంది విద్యార్థులను ఫెయిల్ చేయడం కిరాతకమని పీడీఎ్సయూ రాష్ట్ర సహాయ కార్యదిర్శ ఎం.అంకన్న ఆవేదన వ్యక్తం చేశారు.
పీడీఎ్సయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి అంకన్న
కడప(ఎడ్యుకేషన), ఆగస్టు 12 : యోగివేమన విశ్వవిద్యాలయం డిగ్రీ, సెమిస్టర్ పరీక్షల్లో ఫీజులు కోసం అత్యధిక మంది విద్యార్థులను ఫెయిల్ చేయడం కిరాతకమని పీడీఎ్సయూ రాష్ట్ర సహాయ కార్యదిర్శ ఎం.అంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం కడప నగరం బాలాజీనగర్ పీడీఎ్సయూ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలో మొదటి, మూడవ సెమిస్టర్ పరీక్షల్లో 21,316 మంది విద్యార్థులు రాస్తే కేవలం 8765 అతి తక్కువ మంది విద్యార్థులు పాసయ్యారని, అన్ని వర్గాల నుంచి బలమైన వాదన ఏమిటంటే పీజుల రూపంలో వచ్చే డబ్బుల కోసమే ఇలా ఫెయిల్ చేస్తున్నారని, యూనివర్సిటీ ఆదాయవనరులుగా విద్యార్థులు ఫీజులను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం సెమిస్టర్ పరీక్ష ఫీజు రూ. 10 00 అని, దీంతో పాటు ఫెయిల్ అయిన విద్యార్థులు చెల్లించే సప్లిమెంటరీ పరీక్షా ఫీజులు రివాల్యూయేషన, రివెరిఫికేషన ఫీజులు రూపంలో కోట్లాది రూపాయలు విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పీడీఎ్సయూ జిల్లా నాయకులు అల్లాబకాస్, ప్రశాంత నాగూర్ తదితరులు పాల్గొన్నారు.