మాజీ ముఖ్యమంత్రికి కరోనా.. ఆస్పత్రిలో చేరిక..

ABN , First Publish Date - 2020-10-25T11:11:47+05:30 IST

మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌కు కరోనా సోకింది. ప్రస్తుతం బిహార్‌ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న ఆయన.. ఎన్నికలకు మూడు రోజుల ముందు వైరస్‌ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఫడణవీస్‌.. ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘‘లాక్‌డౌన్‌ కాలం నుంచి క్షణం తీరిక లేకుండా పనిచేశాను.

మాజీ ముఖ్యమంత్రికి కరోనా.. ఆస్పత్రిలో చేరిక..

న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌కు కరోనా సోకింది. ప్రస్తుతం బిహార్‌ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న ఆయన.. ఎన్నికలకు మూడు రోజుల ముందు వైరస్‌ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఫడణవీస్‌.. ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘‘లాక్‌డౌన్‌ కాలం నుంచి క్షణం తీరిక లేకుండా పనిచేశాను. నాకు విశ్రాంతి ఇవ్వడం కోసమే దేవుడు ఇలా చేసినట్లున్నాడు’’ అని ట్విటర్లో పేర్కొన్నారు. కాగా.. దేశంలో తాజాగా 53,370 కరోనా కేసులు నమోదుకాగా.. 67,549 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో.. మొత్తం బాధితుల సంఖ్య 78,14,682కి, మొత్తం రికవరీల సంఖ్య 70,16,046కి చేరింది.

Updated Date - 2020-10-25T11:11:47+05:30 IST