కరోనా వేళ తప్పుడు ప్రచారం.. భారతీయ టెకీపై ఫేస్‌బుక్ గుస్సా!

ABN , First Publish Date - 2020-04-10T23:02:59+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని కూడా క్యాష్ చేసుకోవడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు.

కరోనా వేళ తప్పుడు ప్రచారం.. భారతీయ టెకీపై ఫేస్‌బుక్ గుస్సా!

న్యూయార్క్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని కూడా క్యాష్ చేసుకోవడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. దీనికోసం ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలను ఉపయోగించుకుంటున్నారు. వీరికి కొందరు టెకీలు అండగా ఉండటంతో ఏ ఆటంకం లేకుండా వారి దందా సాగుతోంది. ఇలాంటి నీచులకు సాయం చేస్తున్న ఓ భారతీయ టెకీని ఫేస్‌బుక్ సంస్థ గుర్తించింది. దీనిపై వెంటనే కేసు నమోదు చేసింది. బసంత్ గజ్జర్ అనే టెకీ ‘లీడ్‌క్లోక్’ అనే సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ కొన్ని తప్పుడు యాడ్లను క్లోకింగ్ చేయడం ద్వారా ఫేస్‌బుక్ యాడ్ బాట్‌ను మోసం చేస్తుంది. తద్వారా ఈ యాడ్లు ఫేస్‌బుక్‌లో బ్లాక్ అవడంలేదు. ఇలా ఫేస్‌బుక్‌లో కనిపించే కొన్ని యాడ్లు కరోనాపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తుంటే, మరికొన్నేమో యూజర్ల నుంచి డబ్బును దోచేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన ఫేస్‌బుక్ సంస్థ.. బసంత్ గజ్జర్‌పై కేసు పెట్టింది.

Updated Date - 2020-04-10T23:02:59+05:30 IST