ఫేస్బుక్ ఫ్రెండ్ను నమ్మినందుకు ఆమె సర్వం కోల్పోయింది.. హోటల్కు తీసుకెళ్లి మత్తు ఇచ్చి అతను ఎంత దారుణం చేశాడంటే..
ABN , First Publish Date - 2021-12-24T20:03:40+05:30 IST
ఆమెకు అతడు ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యాడు.. ఆ తర్వాత నెంబర్లు మార్చుకుని ఫోన్లలో మాట్లాడుకునేవారు..
ఆమెకు అతడు ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యాడు.. ఆ తర్వాత నెంబర్లు మార్చుకుని ఫోన్లలో మాట్లాడుకునేవారు.. ఆ స్నేహం ప్రేమగా మారింది.. అతడిని నమ్మిన ఆమె హోటల్కు వెళ్లింది.. అక్కడ ఆమెకు మత్తు ఇచ్చి అతను అత్యాచారం చేశాడు.. ఆ ఘటనను వీడియో తీశాడు.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని చెప్పి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడడమే కాకుండా, డబ్బు, బంగారం కూడా దోచుకున్నాడు.. చివరకు ఆమె పోలీసులను ఆశ్రయించింది.
హర్యానాలోని పాల్వాల్ ప్రాంతానికి చెందిన బాధిత మహిళకు కొన్ని రోజుల క్రితం ఫేస్బుక్ ద్వారా అశోక్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. నేరుగా కలుద్దామని చెప్పి బాధిత మహిళను అశోక్ ఢిల్లీలోని ఓ హోటల్కు ఆహ్వానించాడు. అక్కడకు వెళ్లాక ఆమెకు మత్తు ఇచ్చాడు. ఆమె అపస్మారక స్థితిలో ఉండగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఘటనను వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించి ఆమెను పలుసార్లు హోటల్కు పిలిపించాడు.
ఇప్పటివరకు మూడు సార్లు స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె చేత ఆల్కహాల్ తాగించేవాడు. అంతేకాదు ఆమె నుంచి బంగారు నగలు, రూ.75 వేలు తీసుకున్నాడు. అతడి వేధింపులను భరించలేకపోయిన బాధిత మహిళ చివరకు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల గురించి అన్వేషణ సాగిస్తున్నారు.