నేను కొన్ని అత్యంత మూర్ఖపు ట్వీట్లు చేశా: ఎలాన్ మస్క్

ABN , First Publish Date - 2020-05-23T18:21:23+05:30 IST

తాను గతంలో అనేక మూర్ఖపు ట్వీట్లే చేశానంటూ టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల సీఈఓ ఎలాన్ మస్క్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నేను కొన్ని అత్యంత మూర్ఖపు ట్వీట్లు చేశా: ఎలాన్ మస్క్

వాషింగ్టన్: తాను గతంలో అనేక మూర్ఖపు ట్వీట్లే చేశానంటూ టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల సీఈఓ ఎలాన్ మస్క్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీటిని వెనక్కు తీసుకోవాలనుకుంటున్నట్టు కూడా తెలిపారు. ‘నేను కొన్ని అత్యంత మూర్ఖపు ట్వీట్లు చేశాను. వాటిని ఇప్పుడు వెనక్కు తీసుకోవాలనిపిస్తోంది’ అని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వ్యాఖ్యానించారు. అసలు మీరు ఎందుకు ట్వీట్ చేస్తారు అని విలేకరి ప్రశ్నించగా.. ప్రజలతో నేరుగా సంభాషించేందుకు ఇదో అవకాశమని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతికా సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఉండదని ఆయన అన్నారు.


‘అందరినీ సంతృప్తి పరచడం కష్టమే.  వివాదాస్పదం కానీ వ్యాఖ్యలు చేస్తే బోర్ కొట్టిస్తున్నాడనే కామెంట్ భరించాల్సి వస్తుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్ నుంచి తన కర్మాగారం పునఃప్రారంభానికి ప్రభుత్వం అడ్డుపడతోందని ఆరోపించడం వరకూ ఎలాన్ అనేక వివాదాస్పద ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. ఒకానొక సందర్భంగా.. తన కంపెనీ షేరు విలువ ఎక్కువగా ఉందంటూ స్వయంగా ఎలాన్ మస్క్ ట్వీట్ చేయడంలో టెస్లా షేరు ధర 10 శాతం మేర పడిపోయింది. 

Updated Date - 2020-05-23T18:21:23+05:30 IST