ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో అదనపు బోగీలు

ABN , First Publish Date - 2022-04-17T15:06:23+05:30 IST

రామేశ్వరం, కొల్లమ్‌, గురువాయూరు తదితర ప్రాంతాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా అదనపు బోగీలు ఏర్పాట్లు చేస్తున్నట్లు దక్షిణ రైల్వే ఓ ప్రకటన జారీ చేసింది. తమిళ ఉగాదితోపాటు

ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో అదనపు బోగీలు

చెన్నై: రామేశ్వరం, కొల్లమ్‌, గురువాయూరు తదితర ప్రాంతాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా అదనపు బోగీలు ఏర్పాట్లు చేస్తున్నట్లు దక్షిణ రైల్వే ఓ ప్రకటన జారీ చేసింది. తమిళ ఉగాదితోపాటు వరుస సెలవులకు స్వస్థలాలకు వెళ్ళినవారంతా తిరుగు ప్రయాణానికి టికెట్లు లభించక ఇబ్బందులు పడుతుండటంతో అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18 నుంచి 20 వరకు రామేశ్వరం -ఎగ్మూరు, మంగళూరు - ఎగ్మూరు, ఎగ్మూరు- కారైక్కాల్‌, తాంబరం- నాగర్‌కోవిల్‌, మదురై - సెంట్రల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళలో పడక సదుపాయం కలిగిన అదనపు బోగీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.  ఎగ్మూరు - కొల్లమ్‌, ఎగ్మూరు - రామేశ్వరం, తంజావూరు - ఎగ్మూరు, సెంట్రల్‌ - తిరువనంతపురం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఈ నెల 20 వరకు అదనంగా ఓ బోగీని జతపరచనున్నట్లు తెలిపారు.

Updated Date - 2022-04-17T15:06:23+05:30 IST