మూడు రోజులే గడువు

ABN , First Publish Date - 2022-05-28T04:49:31+05:30 IST

అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథక్నాన ప్రవేశపెట్టింది. ఏటా మూడు విడతలుగా రూ.6 వేలసాయం అందిస్తోంది. ఇక నుంచి సాయం పొందాలంటే ఈకేవైసీ తప్పనిసరని నిబంధన జారీ చేసింది. సాయం యథావిధిగా పొందాలంటే ఈ కేవైసీ పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలి.

మూడు రోజులే గడువు

- పీఎం కిసాన్‌ సమ్మాన్‌కు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి 

- అలర్ట్‌ కాకుంటే సహాయం కట్‌ 

- జిల్లాలో 60,144 మంది రైతులు

- నమోదు చేసుకున్నది 36,659 మంది

- ఈ-కేవైసీకి ఈ నెల 31 వరకే అవకాశం

(ఆంఽద్రజ్యోతి సిరిసిల్ల)

అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథక్నాన ప్రవేశపెట్టింది. ఏటా మూడు విడతలుగా రూ.6 వేలసాయం అందిస్తోంది. ఇక నుంచి సాయం పొందాలంటే ఈకేవైసీ తప్పనిసరని నిబంధన జారీ చేసింది.  సాయం యథావిధిగా పొందాలంటే ఈ కేవైసీ పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలి. ఇందుకోసం ఈ నెల 31వ తేదీ వరకే అవకాశం ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యధిక సంఖ్యలో రైతులు ఇంకా నమోదు చేసుకోవాల్సి ఉంది. రైతులు నమోదు చేసుకోకుంటే కేంద్రం అందించే కిసాన్‌ సమ్మాన్‌ సహాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. జిల్లాలో రైతులకు ఈ కేవైసీ పోర్టల్‌లో ఆదార్‌తోపాటు ఇతర వివరాలు నమోదు చేసుకోవడంలో అవగాహన లేకపోవడంతో జిల్లాలో ఈ కేవైసీ నామమాత్రంగా సాగుతోంది. రైతులకు అవగాహన కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమవుతుందనే విమర్శలు వస్తున్నాయి. మే 1 నుంచి కేవైసీ అవకాశం ఇవ్వగా ఇప్పటి వరకు 61 శాతం మాత్రమే పూర్తయ్యింది. మరో మూడు రోజులు గడువు మాత్రమే మిగిలింది. కిసాన్‌ సమ్మాన్‌ పథకంలో 60142 మంది రైతులు సహాయాన్ని పొందుతున్నారు. ఇందులో ఇప్పటి వరకు 36659 మంది ఈ కేవైసీలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 23483 మంది నమోదు చేసుకోవాల్సి ఉంది. 2185 మంది అనర్హులుగా ఉన్నారు. ఈ కేవైసీ చేసుకోవాలంటే రైతుల ఆధార్‌ కార్డుకు మోబైల్‌ నెంబర్‌ లింక్‌ అయి ఉండాలి. కానీ చాలామంది రైతుల మొబైల్‌ నంబరులు అధార్‌ కార్డులకు లింక్‌  లేదు. ముందుగా మొబైల్‌  నంబరును ఆధార్‌కు లింక్‌ చేసుకోని పోర్టర్‌లో నమోదు చేయాల్సి ఉంది.  


2019 నుంచి కిసాన్‌ సమ్మాన్‌ పథకం 

దేశంలోని రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాన్ని తీసుకొచ్చింది. ప్రతీ సంవత్సరం రూ.6 వేలను మూడు విడతలుగా పట్టాదారు పాసు పుస్తకం ఉన్న రైతులకు అందిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, అదాయ పన్ను చెల్లింపు దారులు, పెన్షనర్లు, ఒకే ఇంట్లో ఎక్కువ మంది పెట్టుబడి సాయం అందుకుంటున్నారు. ఇందులో వీరిని తొలగించడానికి ఈ కేవైసీ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆధార్‌ అనుంసధానం చేయడంతో ఉద్యోగులు, అదాయం పన్ను చెల్లించే వారిని తొలగిస్తారు. జిల్లాలో ఇప్పటి వరకు 2187 మంది అనర్హులను గుర్తించారు. కేవైసీ తరువాత ఎక్కువ సంఖ్యలో అనర్హులు బయటపడే అవకాశం కనిపిస్తోంది. 


Updated Date - 2022-05-28T04:49:31+05:30 IST