ఎఫ్సీఐ ఎస్ఎల్సీసీ మాజీ సభ్యుడు హఠాన్మరణం
ABN , First Publish Date - 2021-05-07T06:30:17+05:30 IST
పుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎ్ఫసీఐ)స్టేట్లెవల్ కో-ఆర్డినేషన్ కమిటీ(ఎ్సఎల్సీసీ) మాజీ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మెరుగ రాజేశ్వరరావు బుధవారం అర్ధరాత్రి గుండెపోటుతో సీతాఫల్మండిలో ఆయన స్వగృహంలో మృతి చెందారు.
బౌద్ధనగర్, మే 6 (ఆంధ్రజ్యోతి): పుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎ్ఫసీఐ)స్టేట్లెవల్ కో-ఆర్డినేషన్ కమిటీ(ఎ్సఎల్సీసీ) మాజీ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మెరుగ రాజేశ్వరరావు బుధవారం అర్ధరాత్రి గుండెపోటుతో సీతాఫల్మండిలో ఆయన స్వగృహంలో మృతి చెందారు. గురువారం పలువురు నాయకులు మృతదేహం వద్ద పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. రాజేశ్వరరావు కృష్ణాజిల్లాలో ఆశ్రమం ఏర్పాటు చేసి పేద విద్యార్థులను చదివిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం తల్లి అంజనాదేవి మృతి చెందితే ఆమె విగ్రహాన్ని ఇంట్లోనే ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. రాజేశ్వరరావు మృతిపట్ల పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.